
జనరల్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవికి భారీ స్పందన లభించింది. నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల్లోనే వెయ్యికి పైగా దరఖాస్తులు అందినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
దరఖాస్తుదారుల్లో మాజీ ఉన్నతాధికారులు, రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నట్లు సమాచారం. జులై 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, జులై 19 నుంచి పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం జులై 22న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో కొత్త సీఈవో నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!