

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా 'రాధేశ్యామ్' సినిమాలో నటించారు. 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, షూటింగ్ సమయంలో ప్రభాస్ చూపించిన ఆతిథ్యాన్ని పూజా తాజాగా గుర్తు చేసుకున్నారు.
సెట్స్లో ప్రభాస్ తనకు పంపించిన రుచికరమైన భోజనాలను ఎప్పటికీ మర్చిపోలేనని పూజా తెలిపారు. ప్రభాస్ దగ్గర నుంచి ఏదైనా దొంగిలించాలంటే ఏమి తీసుకుంటారని అడిగిన ప్రశ్నకు, ఆయన వంటవాడిని తీసుకుంటానని సరదాగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం పూజా హెగ్డే 'జన నాయగన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, దుల్కర్ సల్మాన్ సరసన 'శ్రీ శ్రీ' అనే పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!