

శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు వి.వి. వినాయక్, దశరథ్, రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీకే, సీఎన్ నిర్మించారు.
వేడుకలో శ్రీకాంత్ మాట్లాడుతూ, ధనవంతులైనా ఒక దశలో మధ్యతరగతి జీవితాన్ని అనుభవిస్తారని, ఆ జీవితంలోని కష్టాలను వినోదాత్మకంగా తెరపై చూపించడం ఈ సినిమా ప్రత్యేకత అని అన్నారు. రాజేంద్రప్రసాద్ పోషించిన శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్ర సినిమాకు ప్రధాన బలమని తెలిపారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ పాత్ర తనకు లభించడం అదృష్టమని పేర్కొనగా, దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి శ్రీకాంత్తో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని, ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ వెన్నెముకలా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో అలీ, ధనరాజ్, పృథ్వీరాజ్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, ఛాయాగ్రాహకుడు అంజి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!