
జనరల్

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు బ్రహ్మానందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం గొప్ప నటుడని, తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. అయితే ఆయనకు సీరియస్ పాత్రల్లో నటించే అవకాశాలు తక్కువగా వచ్చాయని కృష్ణవంశీ తెలిపారు.
'రంగ మార్తాండ' సినిమాలో బ్రహ్మానందం కోసం తాను సీరియస్ పాత్రను రాశానని, ఆ సమయంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా తాను పట్టించుకోలేదని చెప్పారు. బ్రహ్మానందం కామెడీ మాత్రమే కాకుండా భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించగలరనే నమ్మకంతోనే ఆయనను ఎంపిక చేశానని వెల్లడించారు. ఈ సినిమాలో తన నటనతో బ్రహ్మానందం ప్రేక్షకులను ఆకట్టుకున్నారని కృష్ణవంశీ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!