
జనరల్

గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఆదాయానికి సంబంధించిన 2026-27 అసెస్మెంట్ సంవత్సరం కోసం ఇప్పటికే 1.7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్లు) దాఖలైనట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీఆర్-1 (సహజ్), ఐటీఆర్-2 దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీగా ఉండగా, ఒక్క శుక్రవారం రోజే 10 లక్షలకు పైగా రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.
ఐటీఆర్-1 (సహజ్) వార్షిక ఆదాయం రూ.50 లక్షలలోపు ఉండి, జీతం, ఒక గృహ ఆస్తి, రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. ఐటీఆర్-2 వ్యాపార లేదా వృత్తి ఆదాయం కాకుండా మూలధన లాభాలు వంటి ఇతర ఆదాయాలు పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFలు) దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసేలోపు రిటర్నులు దాఖలు చేయాలని ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!