
జనరల్

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దొరసాని మండపం సమీప ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా చూడాలని అధికారులను సూచించారు.
అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, విజిలెన్స్ బృందాల సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. హనుమాన్ బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో పొదలను తొలగించి స్పష్టమైన వీక్షణ ఏర్పాట్లు చేయాలని, భక్తులు గుంపులుగా ప్రయాణించేలా అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. భక్తుల్లో భయం రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!