
జనరల్

హైబీపీ (అధిక రక్తపోటు) వయసుతోనే వస్తుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ వయసులోనైనా ఈ సమస్య తలెత్తవచ్చని, ముఖ్యంగా యువతలో ఇది పెరుగుతున్నదని పేర్కొంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, 15 ఏళ్లకు పైబడిన అబ్బాయిల్లో 22 శాతం, అమ్మాయిల్లో 19.4 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో నివసించే వారిలో హైబీపీ ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అందువల్ల చిన్న వయసులోనే రక్తపోటు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అత్యంత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!