

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల క్షేమంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 3న ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి బయలుదేరిన బోటు ఆగస్టు 13 నాటికి తిరిగి రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. బోటు కోసం మెరైన్ పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మత్స్యకారుల ప్రాణాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖలతో పాటు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!