
జనరల్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మరో శాఖకు మార్చే ఆలోచన కాకుండా, వెంటనే పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు పెట్టిన మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా కోరారు.
విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని రాహుల్ ఆరోపించారు. పెల్లెట్ దాడుల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, దాడులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు విడుదల చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. నీట్ లీక్ వ్యవహారంపై బాధిత విద్యార్థులకు ప్రధాని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!