

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన కొద్ది రోజులకే హౌస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వాదోపవాదాలతో హౌస్లో సందడి నెలకొంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా.. వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు ఏ సీజన్లోనూ చూడని విధంగా మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటు డబుల్ ఎలిమినేషన్కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హౌస్లో జరుగుతున్న ‘మహా పరీక్ష’ టాస్క్ ఆధారంగా సరిగ్గా ఆడని కంటెస్టెంట్లను ‘హై రిస్క్ జోన్’లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చరణ్, ఆటో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్లో ఉన్నట్లు సమాచారం. తదుపరి టాస్క్ ద్వారా మరో ఇద్దరు ఈ జోన్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హై రిస్క్ జోన్లో ఉన్నవారిలో కొందరిని మిడ్ వీక్లోనే ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చరణ్కు ఓటింగ్ ఉన్నప్పటికీ.. హౌస్లో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం అతనికి ప్రతికూలంగా మారొచ్చని తెలుస్తోంది. తక్కువ ఓటింగ్ ఉన్న కృష్ణుడికి కూడా ఎలిమినేషన్ ముప్పు ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కామనర్ కేటగిరీలోని ఝాన్సీకి ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఆమె వద్ద నామినేషన్స్ నుంచి బయటపడే పవర్ ఉండటంతో మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!