

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఆయన.. ఈ ఏడాది మూడో చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ను టార్గెట్ చేయనున్నారు. ‘ఆవేశం’ వంటి బ్లాక్బస్టర్ను అందించిన జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 47 చిత్రానికి ఎట్టకేలకు ‘సీన్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్గా స్టైలిష్ అవతార్లో కనిపించారు. షార్ట్, టీషర్ట్లో రఫ్ అండ్ కూల్ లుక్లో కనిపిస్తూ.. జైలు ఖైదీల మధ్య నుంచి పోలీస్ అధికారి భుజంపై చేయి వేసుకుని సూర్య నడుచుకుంటూ వచ్చే సన్నివేశం ఆకట్టుకుంది.
‘సీన్’లో మలయాళ నటి నజ్రియా ఫహాద్ కథానాయికగా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సూర్య, నస్లెన్ కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. యాక్షన్, కామెడీ, క్రైమ్ అంశాలను మేళవిస్తూ జీతూ మాధవన్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సూర్య, జీతూ మాధవన్, జఘరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. అదే రోజున ‘రామాయణ’తో బాక్సాఫీస్ క్లాష్ ఉండటంతో దీపావళి రేసు ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!