
జనరల్

గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా ఆమె ఎగరేసిన ధిక్కార పతాకం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం ఆమెకు ఘన నివాళులు అర్పించారు.
దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. వారి ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!