
సినిమాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలకు (గోల్కొండ బోనాలు) ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో, పూజారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు.
ఆషాఢ మాస బోనాల వేడుకల్లో భాగంగా గోల్కొండలో జరగనున్న ఈ ఉత్సవాలు సంప్రదాయాలు, భక్తి విశ్వాసాలతో ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాలని ఆలయ వర్గాలు కోరాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!