

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారులు మూడో రోజు భూముల సర్వే కొనసాగిస్తున్నారు. మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ ఉన్న ప్రాంతంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. సర్వేను మూడు బృందాలుగా ఏర్పడి నిర్వహిస్తున్నారు. భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలిస్తూ అధికారులు సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజ్పూర్ గ్రామాల సరిహద్దులో ఉన్న సర్వే నంబర్ 325పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సర్వే నంబర్లోని భూమి హద్దులను గుర్తించడంతో పాటు మొత్తం విస్తీర్ణాన్ని కూడా నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అసైన్డ్ భూముల బౌండరీలకు మార్కింగ్ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు సర్వే, భూ కొలతలు, రికార్డుల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!