

బిగ్బాస్ తెలుగు 10లో కెప్టెన్సీ టాస్క్ హౌస్లో ఉత్కంఠను పెంచింది. ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ కెప్టెన్సీ కంటెండర్లుగా బరిలోకి దిగారు. బిగ్బాస్ నిబంధనల ప్రకారం ఈ ఐదుగురిని జైలులో ఉంచగా, మిగతా హౌస్మేట్స్ గార్డులుగా వ్యవహరించారు. వంశీ, రోహిత్ నియంత్రణ బాధ్యతలు తీసుకున్నారు. జైలు గేట్లు తెరిచిన వెంటనే కంటెండర్లు గోడ దూకి సేఫ్ జోన్కు చేరాల్సి ఉండగా, తమకు కెప్టెన్గా వద్దనుకున్న కంటెండర్లను గార్డులు అడ్డుకునే అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో గార్డులు రెండు గ్రూపులుగా విడిపోయారు. వర్షిణి, నరేష్, దేబ్జాని కలిసి షాలినిని అడ్డుకున్నారు. మరోవైపు రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ సేఫ్ జోన్కు చేరుకున్నారు. షాలినిని అడ్డుకునే సమయంలో వర్షిణి చేసిన వయసు, అనుభవానికి సంబంధించిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. ఆ తర్వాతి రౌండ్లలో ముఖేష్, త్రిగుణ్ టాస్క్ నుంచి తప్పుకున్నారు. దీంతో రామ్ ప్రసాద్, ఝాన్సీ తుది పోరుకు చేరుకున్నారు. ఫైనల్ రౌండ్లో కట్టర్తో ఫెన్సింగ్ను కట్ చేసి అవతలి వైపుకు చేరుకుని కెప్టెన్సీ జెండాను ఎగరేయాల్సి ఉండగా, ఝాన్సీ వేగంగా టాస్క్ పూర్తి చేసి హౌస్లో తొలి కెప్టెన్గా నిలిచింది. కెప్టెన్గా ఆమెకు ప్రత్యేక గది కూడా లభించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!