26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

Writer: Chandrika 07:36 AM, 26 జులై, 2026
సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాలు, నెలకు రూ.1.25 లక్షల వేతనం అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనలను నమ్మిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు వంద మంది యువత సైబర్‌ ముఠా వలలో చిక్కుకున్నట్లు సమాచారం. బాధితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని రాధారంగానగర్‌కు చెందిన సాయిబాబా, కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన పూర్ణ వెంకటకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శ్రీరామ్‌ ఉన్నారు. విదేశాలకు తీసుకెళ్లిన తర్వాత వారి పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని నిర్బంధించినట్లు బాధితులు వెల్లడించారు. వారి నుంచి అందిన సమాచారం ఆధారంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు జులై 17న విదేశాంగ శాఖకు, జులై 22న ఏపీఎన్‌ఆర్‌టీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడిన ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్న సాయిబాబా, పూర్ణ వెంకటకృష్ణ తదితరులు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చిందనే సమాచారంతో ఏప్రిల్‌ 2న విజయవాడ నుంచి బయలుదేరారు. అయితే నియామక ప్రతినిధులు వారిని సింగపూర్‌కు కాకుండా కంబోడియాకు, అనంతరం మయన్మార్‌కు తరలించినట్లు బాధితులు తెలిపారు. అక్కడ మారుమూల ప్రాంతాల్లో నిర్బంధించి బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నారని, ఆదేశాలు పాటించకపోతే విద్యుత్తు షాక్‌లు ఇవ్వడం, చీకటి గదుల్లో బంధించడం, ఆహారం ఇవ్వకుండా వేధించడం వంటి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొందరు యువతులు లైంగిక దాడులకు గురవుతున్నట్లు కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిలో 18 మందిని తిరిగి పట్టుకుని హింసించినట్లు తెలిపారు. తమను విడిచిపెట్టాలంటే ఒక్కొక్కరు రూ.15 లక్షలు చెల్లించాలని ముఠా డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, యువతను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

ట్యాగ్లు
మయన్మార్ సైబర్ మోసంసింగపూర్ ఉద్యోగ మోసంతెలుగు యువతసైబర్ ముఠానకిలీ ఐటీ ఉద్యోగాలుకంబోడియా ఉద్యోగ మోసంమానవ అక్రమ రవాణాఏపీఎన్‌ఆర్‌టీఆంధ్రప్రదేశ్ యువతసైబర్ నేరాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనహత్‌ సింగ్‌ చరిత్ర.. వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌
క్రీడలు

అనహత్‌ సింగ్‌ చరిత్ర.. వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
జనరల్

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

అసోంలో తగ్గని వరద బీభత్సం..
జనరల్

అసోంలో తగ్గని వరద బీభత్సం..

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..
జనరల్

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..
రాజకీయాలు

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..
జనరల్

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..
జనరల్

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..
జనరల్

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు
జనరల్

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..
జనరల్

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..