
సినిమాలు

తన మేనల్లుడు చిన్న శీను టీడీపీలో చేరడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి మనిషికి కొంత స్వార్థం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు శాశ్వతమని, మనుషులు వస్తుంటారు.. పోతుంటారని అన్నారు. పార్టీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొన్నారు.
చిన్న శీను టీడీపీలో చేరడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నట్టుగా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తమకు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. వ్యక్తులు పార్టీలు మారినా.. పార్టీ తన విధానాలు, కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!