

సీజేపీ నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేటర్ నోయిడా విద్యార్థికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నోటీసులు ఎలా జారీ చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో సెప్టెంబర్ 4న సదరు విద్యార్థికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 5న వాటిని అధికారులు ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో సీనియర్ న్యాయవాది బిశ్వజిత్ భట్టాచార్య.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో న్యాయస్థానం మేజిస్ట్రేట్ తీరుపై ప్రశ్నలు సంధించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!