

వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీనగర్ దేశీయ పర్యాటకుల ప్రధాన గమ్యస్థానంగా మారింది. గ్లోబల్ ఏవియేషన్ డేటా అనలిటిక్స్ సంస్థ OAG విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు గత ఏడాదితో పోలిస్తే దిల్లీ–శ్రీనగర్ మార్గంలో రెండు లక్షలకు పైగా అదనపు సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ మార్గంలో సీట్ల సామర్థ్యం 35 శాతం పెరగగా, భారీ డిమాండ్ కారణంగా కొన్ని రోజుల్లో విమాన టికెట్ ధరలు 40 శాతం వరకు పెరిగాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో విమాన ఇంధన ధరలు పెరగడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. దీంతో ఎయిర్లైన్స్ లండన్ వంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాలకు అదనపు సీట్లను కేటాయించాయి. 2025 జూన్తో పోలిస్తే దిల్లీ–లండన్ హీత్రూ మార్గంలో 15 శాతం, ముంబయి–లండన్ హీత్రూ మార్గంలో 12 శాతం అధిక సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో ముంబయి–దిల్లీ దేశంలోనే అత్యంత రద్దీ విమాన మార్గంగా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!