

హైదరాబాద్లోని వీహబ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా నాలుగో విడత ప్యానెల్ చర్చ జరిగింది. “ప్రజా స్థలాలు అందరివే – పురుషుల ఉనికి, వారి ప్రవర్తన” అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి చారు సిన్హా, దర్శకుడు శేఖర్ కమ్ముల, జర్నలిస్టు రిచా మిశ్రా, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు. మహిళలు ప్రజా ప్రదేశాల్లో ఎదుర్కొనే వేధింపులు, అసౌకర్యాలు, భయాందోళనలపై విస్తృతంగా చర్చించారు.
మహిళల భద్రత కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి తన ప్రవర్తన ద్వారా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని వక్తలు పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం, మద్దతు, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని సూచించారు. మహిళలు భయరహితంగా, గౌరవప్రదంగా జీవించే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లింగ సమానత్వం, సామాజిక చైతన్యం, పరస్పర అవగాహన పెంపొందించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!