

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సమయంలో జరిగిన చిన్న వర్గీకరణ పొరపాటు ఓ ఉద్యోగిపై రూ.6.63 కోట్ల పెనాల్టీకి దారితీసింది. కంపెనీ నుంచి పొందిన జీతం, ఈఎస్ఓపీ (ESOP) ప్రయోజనాలను పూర్తిగా వెల్లడించినప్పటికీ, వాటిని పొరపాటున జీతం కేటగిరీకి బదులుగా క్యాపిటల్ గెయిన్స్ విభాగంలో నమోదు చేశారు. దీంతో ఆదాయాన్ని దాచిపెట్టారని భావించిన ఐటీ శాఖ సెక్షన్ 271(1)(c) కింద భారీ జరిమానా విధించింది.
ఈ నిర్ణయాన్ని ఉద్యోగి ముంబై ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్లో సవాలు చేయగా, ట్రైబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగి తన ఆదాయ వివరాలన్నింటినీ ఫారమ్-16తో పాటు ఐటీఆర్లో పూర్తిగా వెల్లడించాడని, ఇది పన్ను ఎగవేత కాదు, కేవలం సాంకేతిక వర్గీకరణ తప్పిదమని స్పష్టం చేసింది. ఆదాయాన్ని దాచాలనే ఉద్దేశం లేదని పేర్కొంటూ రూ.6.63 కోట్ల పెనాల్టీని పూర్తిగా రద్దు చేసింది. ఈ తీర్పు ఐటీఆర్ దాఖలు సమయంలో సరైన ఆదాయ వర్గీకరణ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!