
సినిమాలు

తిరుమల కొండకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మైలు దాటిన తర్వాత మండపం ప్రాంతంలో, నరసింహస్వామి ఆలయం సమీపంలో రెండు రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరుత కనిపించినట్లు భక్తులు తెలిపారు. చిరుతను చూసిన కొందరు భయాందోళనకు గురై నడకమార్గం నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.
చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నడకమార్గంలో గుంపులుగా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మార్గంలో పర్యవేక్షణను పెంచారు. నడకమార్గంలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!