

కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సాయంత్రంలోగా ఆమె రాజీనామా చేయకపోతే లోక్భవన్కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలోపే సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బర్తరఫ్ చేయించుకోవడం కంటే స్వయంగా రాజీనామా చేయడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, పరిస్థితిని అంతవరకు తీసుకురావద్దని మల్లికార్జున్ ఖర్గే సురేఖకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ఆమె కోరినప్పటికీ ఎలాంటి ఊరట లభించలేదని సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్న సురేఖ, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!