

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు ఆయన యూకేలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు పెట్టుబడిదారులు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తమిళనాడులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
దక్షిణ భారతదేశంలో భారీ పారిశ్రామిక, మూలధన పెట్టుబడులను ఆకర్షించేందుకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో విజయ్ యూకే పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయ తయారీ కేంద్రాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. సెప్టెంబర్ 4న పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం తైవాన్లో జరిగే సెమీకాన్ సదస్సుకు హాజరుకానుంది. సెమీకండక్టర్లు, టెక్నాలజీ, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ఈ పర్యటనలో చర్చలు జరగనున్నాయి. జూలై 2026లో యూకే-ఇండియా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయ్ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!