

రాష్ట్రంలో ఉపాధ్యాయులను సమాజంలో మార్పుకు నాయకత్వం వహించే లీడర్లుగా భావిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమైన మంత్రి, వారు అక్కడ నేర్చుకున్న విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలపై చర్చించారు. కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పిస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతలను విద్యలో ప్రవేశపెట్టాలని తెలిపారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మార్పుకు దారితీసే "ఛేంజ్ మేకర్స్"గా మారి, ఇతర ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయాలని, పాఠశాల, క్లస్టర్, మండల స్థాయిలో విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!