

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆగస్ట్ 10న వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన శుభ ముహూర్తం ప్రకారం ఈ మహాయాగం నిర్వహించనున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాగ క్రతువులు జరుగుతాయి. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళతో నిండాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో యాగం నిర్వహించబడుతుంది. సాయంత్రం జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ విషయాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఎంఎస్ఎన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!