

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్పై చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీ, మండలిలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్హౌస్ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని కాంగ్రెస్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫామ్హౌస్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వైపు బయలుదేరారు.
మరోవైపు రైతుల సమస్యలపై నిరసనగా బీఆర్ఎస్ నేతలు మర్కూక్ మండల కేంద్రంలో రైతు దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రధాన రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హకీంపేట నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని అరెస్ట్ చేసి బోయిన్పల్లి, జవహర్నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేటీఆర్ను బోయిన్పల్లి పీఎస్కు, హరీశ్రావును జవహర్నగర్ పీఎస్కు తీసుకెళ్లారు. రెండు పార్టీల కార్యక్రమాల నేపథ్యంలో మర్కూక్ మండలంలో పోలీసుల నిఘా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!