

అయోధ్య రామాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న ఉగ్ర కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీ సోహైల్ను కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో సంయుక్త ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలపై విచారణ కొనసాగుతోంది. ఆలయంపై దాడికి సంబంధించిన కుట్రలో అతని పాత్రపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
నిందితుడి అరెస్టు అనంతరం అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డిజిటల్ ఆధారాలు, కమ్యూనికేషన్ రికార్డులు, విదేశీ హ్యాండ్లర్లతో ఉన్నట్లు భావిస్తున్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు పూర్తి వివరాలను వెల్లడించబోమని అధికారులు పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!