

తుర్కియే పర్యటన అనంతరం తనపై ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరినట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో క్యాటరింగ్ వాహనం ద్వారా తనను మరో విమానానికి తరలించారని, అదే సమయంలో ఎయిర్ఫోర్స్ వన్ను డెకాయ్గా పంపినట్లు తెలిపారు. అయితే ఈ ముప్పును తాను పెద్దగా పట్టించుకోలేదని ట్రంప్ చెప్పారు. ఈ ఘటనలో అధికారిక విమానంలో ప్రయాణించిన శ్వేతసౌధం అధికారులు, భద్రతా సిబ్బంది, విలేకరులకు ఎదురయ్యే ప్రమాదాన్ని కూడా ఆయన తక్కువ చేసి చూపారు.
మరోవైపు ఇరాన్పై ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, చర్చల నుంచి ఇరాన్ వెనక్కి తగ్గినా లేదా దుందుడుకు చర్యలకు పాల్పడినా కఠిన ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ రేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పనామా జెండాతో ఉన్న ‘వేలా నోవా’ కార్గో నౌకపై అమెరికా నేవీ హెలికాప్టర్ రెండు హెల్ఫైర్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడితో పాటు హర్మూజ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం పనామా కాల్వపైనా పడింది. నౌకల రద్దీ పెరగడంతో కొన్ని భారీ వాణిజ్య నౌకలకు సుమారు 10 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!