

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూలై నుంచి సెప్టెంబర్ వరకు పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీ పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవని తెలిపింది.
అలాగే ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు, సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ తేదీల్లో వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ముందురోజు అనుమతి ఉంటుందని పేర్కొంది. భక్తులు ముందుగానే తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!