
సినిమాలు

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఉదయం 8 గంటల తర్వాత ఎలాంటి టోకెన్ లేకుండా క్యూలైన్లలోకి వెళ్లే భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రస్తుతం ఉచిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల్లో దర్శనం కలుగుతుండగా, రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 86,021 మంది భక్తులు దర్శించుకోగా, 33,356 మంది తలనీలాల మొక్కులు చెల్లించారు. హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు నమోదవగా, 4.08 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.16 లక్షల మంది అన్నప్రసాదాలను స్వీకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!