

బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింటా ఎనిమిదేళ్ల తర్వాత బట్వారా 1947 సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాలో సన్నీ డియోల్ సరసన నటిస్తున్నారు. 1947 విభజన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తుండగా, ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే షూటింగ్ సమయంలో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదానికి దారి తీసింది. ఆ వీడియోలో ప్రీతి జింటా వ్యానిటీ వ్యాన్ నుంచి బయటకు వచ్చి ఫొటోగ్రాఫర్లను దారి ఇవ్వమని అడుగుతూ ఆమిర్ ఖాన్ను పట్టించుకోనట్లుగా కనిపించారు.
ఈ వీడియో ఆధారంగా ప్రీతి జింటా కావాలనే ఆమిర్ ఖాన్ను పట్టించుకోలేదని వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై ఆమె ఘాటుగా స్పందిస్తూ ఇవన్నీ కేవలం వ్యూస్ కోసం సృష్టించిన అబద్ధాలేనని మండిపడ్డారు. షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ల కోసం ఫ్లైట్ అందుకోవాలనే తొందరలో ఉన్నానని, అందుకే ఆమిర్ను గమనించలేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొనసాగితే ఇకపై ఫొటోల కోసం తాను ఆగనని హెచ్చరించారు. ఆమిర్ ఖాన్పై తనకు ఎంతో గౌరవం ఉందని, అనవసర పుకార్లను నమ్మవద్దని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!