
జనరల్

విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. భానుకుమార్, రమణ మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలిన వారి గుర్తింపునకు బంధువుల నుంచి నమూనాల సేకరణ కొనసాగుతోంది. మృతదేహాలను కేజీహెచ్కు తరలించి తదుపరి ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 8 మృతదేహాలు మార్చురీకి చేరాయి. అవి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో గుర్తింపునకు జన్యు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బంధువుల నుంచి నమూనాలు సేకరించి విజయవాడ ప్రయోగశాలకు పంపిస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ పూర్తైన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలను కూడా సిద్ధం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!