
సినిమాలు

తెలుగు రాష్ట్రాల్లో విదేశీ ఉద్యోగాల పేరుతో ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ మోసానికి పాల్పడిందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. యూకే, యూరప్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కార్యాలయాలు నిర్వహిస్తూ వేల మంది ఉద్యోగార్థులను మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య శ్రీనివాస్పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, సంబంధిత లావాదేవీలు, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!