
జనరల్

ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు విజయ డెయిరీ శుభవార్త అందించింది. పాల సేకరణ ధరను లీటర్కు రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు లీటర్కు రూ.85 చెల్లించగా.. సెప్టెంబర్ 1 నుంచి రూ.88 చెల్లించనున్నట్లు విజయ డెయిరీ ఎండీ ఈశ్వరరావు వెల్లడించారు. పెరిగిన ధరతో పాడి రైతులకు అదనపు ఆదాయం లభించనుంది.
పాల సేకరణ ధర పెంపు నిర్ణయం రాష్ట్రంలోని పాడి రైతులకు కొంత ఊరటనివ్వనుంది. పాల ఉత్పత్తి, సేకరణలో రైతుల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొత్త ధర సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!