
జనరల్

మార్కాపురం జిల్లాలోని కంభం చెరువు కనుచూపు మేర విస్తరించిన అద్భుతమైన మానవ నిర్మిత కట్టడం. ఈ చెరువు అంత విస్తారంగా ఉండటంతో ఒకేసారి పూర్తిగా చూడటం కష్టమే కాకుండా, డ్రోన్ కెమెరాలతో కూడా ఒక్క ఫ్రేమ్లో బంధించడం సాధ్యం కాదు. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ చెరువు ప్రాచీన ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.
సుమారు 6 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పొడవు 7 కి.మీ., వెడల్పు 3.5 కి.మీ. ఉండి, 3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో కనిపించే కొండలు, పచ్చని పొలాలు, పక్కనే వెళ్లే గుంటూరు–గుంతకల్లు రైల్వే మార్గం కలిపి ఈ ప్రాంతాన్ని అద్భుత దృశ్యంగా మార్చుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!