
సినిమాలు

ప్రముఖ హాస్యనటులు సత్య, యోగిబాబు కలిసి నటిస్తున్న కొత్త వినోదాత్మక చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ‘రంగబలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ బాసంశెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ కమెడియన్లు ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది.
నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లపై పవన్ బాసంశెట్టి, నాగార్జున రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!