

చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన విజయాన్ని అందుకుంటోంది. విడుదలైన సమయంలో వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి సినిమా తొలగించే పరిస్థితి రావొచ్చని, ప్రేక్షకులు ఆదరించాలని కథానాయకుడు శోబినవ్ సత్య భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఆ తర్వాత సినిమాకు వచ్చిన ఆర్గానిక్ మౌత్ టాక్, భక్తి భావోద్వేగం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంతో వసూళ్లు క్రమంగా పుంజుకున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘హనుమాన్ అంశ్’ ఇప్పటికే రూ.26 కోట్ల మార్క్ను దాటినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రూ.50 కోట్ల మైలురాయి దిశగా సినిమా దూసుకెళ్తోందని సమాచారం. భారీ ప్రమోషనల్ బడ్జెట్, స్టార్ పవర్ లేకపోయినా బలమైన కథ, ఆధ్యాత్మిక అంశాలు, ప్రేక్షకుల మద్దతుతో సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషంగా మారింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు దానిని ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!