

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా టీజర్ కట్ పనులు ప్రారంభమై, సెప్టెంబర్ మొదటి వారంలో టీజర్ను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండ ఇందులో టైటిల్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. బ్రిటిష్ పాలన కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో కథ సాగనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ప్రచార కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. టీజర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంటే ‘రణబాలి’పై హైప్ మరింత పెరిగే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!