

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైథలాజికల్ టచ్తో కూడిన గ్లోబ్ట్రాటింగ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర వ్యవధిలో భారీ షెడ్యూల్స్ను పూర్తి చేసినట్లు టాక్. అంతర్జాతీయ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటు, సాంగ్స్, రామాయణ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల్లోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అయితే ‘వారణాసి’ కోసం రాజమౌళి తన సాధారణ వర్కింగ్ స్టైల్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజమౌళి సినిమాలకు ఎక్కువ సమయం పడుతుండగా, ఈసారి ముందుగానే రిలీజ్ డేట్ను ఖరారు చేసుకుని దానికి అనుగుణంగా షూటింగ్ను వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నట్లు టాక్. అంతర్జాతీయ లొకేషన్లలో సమస్యలు ఎదురైన సందర్భాల్లో కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలతో షూటింగ్కు అంతరాయం రాకుండా చూసుకున్నట్లు సమాచారం. దసరా నుంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించి వరుస అప్డేట్స్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘వారణాసి’ కోసం జక్కన్న నిజంగానే తన రూట్ మార్చారా అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!