

మహిళల టీ20 ఆసియా కప్లో భారత జట్టు అజేయ విజయాలతో ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ ట్రోఫీని సొంతం చేసుకోవాలని హర్మన్ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. మరోవైపు శ్రీలంక కూడా ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఫైనల్కు వచ్చింది. గ్రూప్-బిలో మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన శ్రీలంక.. సెమీఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్లోని నెమ్మదైన పిచ్లపై బ్యాటింగ్ కష్టంగా మారినా భారత్ ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.
భారత్ తరఫున షెఫాలి వర్మ 168 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్గా నిలవగా, స్మృతి మంధాన 154 పరుగులతో రెండో స్థానంలో ఉంది. బౌలింగ్లో దీప్తి శర్మ 11 వికెట్లతో టోర్నీలో నంబర్వన్ బౌలర్గా కొనసాగుతోంది. శ్రీచరణి ఎనిమిది, ప్రేమ రావత్ ఆరు వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నారు. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు కూడా 11 వికెట్లు పడగొట్టి ప్రమాదకరంగా కనిపిస్తోంది. హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షిక సిల్వ వంటి ప్రతిభావంతులతో ఉన్న శ్రీలంకను భారత్ ఫైనల్లో జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!