

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా, దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా విడుదలకు ముందే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఫస్ట్ కాపీ సిద్ధమైనట్లు సమాచారం. విడుదలకు ముందు ఘట్టమనేని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిత్రబృందం కూడా ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం ఉందని, మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా మరో షో ఏర్పాటు చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తిరుపతి నేపథ్యంగా రూపొందినట్లు సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆధారంగా కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. భక్తి, భావోద్వేగం, థ్రిల్లింగ్ అంశాల సమ్మేళనంగా ఈ చిత్రం ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!