

సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం చివరి షెడ్యూల్ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో మందాకినిగా నటిస్తున్న ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో కనిపించనున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మహేశ్బాబు మిగిలిన షూటింగ్ను సెప్టెంబర్ 26–27 ప్రాంతంలో పూర్తి చేయనున్నారని సమాచారం. దీంతో అక్టోబర్ మొదటి వారానికి చిత్రీకరణ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.
షూటింగ్ ముగింపుకు చేరుకోవడంతో ‘వారణాసి’ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది. సినిమా షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో మహేశ్బాబు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఎప్పుడు వస్తాయనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అయితే ప్రమోషనల్ కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని అభిమానులకు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!