

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, దర్శకుడు అరుణరాజా కామరాజ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన చిత్రం రద్దయింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్పై ఎంతో ఆసక్తితో పనిచేశానని, ‘గట్టుకుస్తీ 2’ తర్వాత సినిమాను పట్టాలెక్కించేందుకు దాదాపు పది నెలల పాటు కష్టపడ్డానని తెలిపారు. అయితే దర్శకుడితో విభేదాలు, బడ్జెట్కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
పరస్పర అంగీకారంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నామని విష్ణు విశాల్ తెలిపారు. నటుడిగా, నిర్మాతగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఆయన పేర్కొన్నారు. సినిమా రద్దుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం ‘ఇరందు వానం’, తన సోదరుడి ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ చిత్రాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మరో కొత్త ప్రాజెక్ట్ను కూడా సిద్ధం చేస్తున్నానని, దాని వివరాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!