

భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో 'రామాయణ' ఒకటి. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. ఇటీవల ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ట్రైలర్ ప్రదర్శించగా ప్రశంసలు దక్కాయి. దీంతో ఆన్లైన్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చివరి క్షణంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటించిన తేదీన ట్రైలర్ విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ట్రైలర్ వాయిదా వార్తతో పాటు మరో కీలక ప్రకటనను కూడా మేకర్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని మరింత విస్తృతంగా విడుదల చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ఒప్పందం సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లే అడుగుగా భావిస్తున్నారు. ట్రైలర్కు సంబంధించిన కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. దీంతో అభిమానులు మరో ప్రకటన కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రతి అప్డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.













కామెంట్స్ (1)
❤️