

రాజమౌళి, మహేశ్బాబు కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ టైటిల్ హక్కులపై నెలకొన్న వివాదం పరస్పర అవగాహనతో ముగిసింది. ఈ పేరును ముందుగానే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో దర్శకుడు సుబ్బారెడ్డి రిజిస్టర్ చేసుకున్నారు. అదే పేరును రాజమౌళి సినిమా కోసం ఖరారు చేయడంతో నిబంధనల ప్రకారం చర్చలు జరిగాయి. చివరకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం తీసుకోకుండా టైటిల్ హక్కులను నిర్మాతలకు అప్పగించేందుకు సుబ్బారెడ్డి అంగీకరించారు.
తన అభిమాన హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి చేస్తున్న భారీ చిత్రానికి ఈ పేరు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. మాజీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ సమక్షంలో నిర్మాత కె.ఎల్. నారాయణకు టైటిల్కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ నిర్ణయం పరిశ్రమలో పరస్పర సహకారానికి మంచి ఉదాహరణగా నిలుస్తుందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!