
జనరల్

చైనాలో బావి తుఫాన్ ప్రభావంతో జూలై 19న జేజియాంగ్ ప్రావిన్స్లో సంభవించిన శక్తివంతమైన టోర్నడో తీవ్ర విధ్వంసం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు గాల్లోకి ఎగిరిపోయిన భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి.
తుఫాన్ కారణంగా వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, సుమారు 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలు రంగంలోకి దిగి బాధిత ప్రాంతాల్లో సహాయం అందిస్తున్నాయి. నష్టంపై పూర్తి అంచనా వేసే పనులు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!