

దక్షిణాది సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్ తమ తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు బదులుగా బలమైన కథాంశాలతో కూడిన చిన్న లేదా మధ్యస్థాయి సినిమాలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో ముందుగా మంచి కథతో విజయాన్ని అందుకుని, ఆ తర్వాత భారీ ప్రాజెక్టులను ప్రారంభించాలని ఇద్దరు దర్శకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ తన కలల ప్రాజెక్ట్ ‘వేల్పరి’కి ముందు ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ను పూర్తి చేయాలని చూస్తుండగా, ఏఆర్ మురుగదాస్ కూడా తదుపరి భారీ చిత్రానికి ముందు చిన్న స్థాయి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!