

‘అనకాపల్లి’ చిత్రాన్ని యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, సామాజిక సందేశం కలగలిపిన కథగా రూపొందించినట్లు నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు తెలిపారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. సహజత్వం కోల్పోకుండా ఉండేందుకు మొత్తం సినిమాను అనకాపల్లిలోని నిజమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు వెల్లడించారు.
ప్రస్తుత తరం కుటుంబ బంధాల విలువను మరింతగా అర్థం చేసుకునేలా ఈ కథను రూపొందించామని, యాక్షన్తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని నిర్మాతలు పేర్కొన్నారు. నటీనటుల అద్భుతమైన నటన, దేవ్ జండ్ అందించిన సంగీతం, సహజమైన విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!