
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ ప్రముఖులు హాజరై చిత్రాన్ని వీక్షించారు.
హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో జరిగిన ప్రీమియర్ షోకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “సినిమా బాగుంది” అని తెలిపారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి, రమా రాజమౌళి సహా పలువురు ప్రముఖులు కూడా ప్రీమియర్ షోను వీక్షించడంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!